ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా(Ilaiyaraaja) కుమార్తె గాయని భవతరిణి (Bhavatharini)(47) ఇటీవల (జనవరి 25న) మృతిచెందిన విషయం తెలిసిందే. కొంత కాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న భవతరణి..శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ అక్కడే కన్నుమూశారు. ఆమె మరణంతో ఇళయరాజా ఒక్కసారిగా తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన తెలుగు, తమిళ ప్రముఖులు ఇళయరాజాని కలిసి ఓదార్చుతున్నారు.
తాజాగా హీరో మోహన్ బాబు(Mohan Babu) సతీసమేతంగా ఇళయరాజా ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక ఈ ఫోటోలను మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
'ఇళయరాజా కుమార్తె భవతారిణిని కోల్పోయిన ఆయనకు మరియు అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాద క్షణాన్ని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను..అంటూ మోహన్ బాబు ట్వీట్ లో తెలిపారు.
ఇక మోహన్ బాబు – ఇళయరాజా ఇండస్ట్రీలో మంచి స్నేహితులు. అంతేకాదు మోహన్ బాబు డాటర్ మంచు లక్ష్మీ నటించిన గుండెల్లో గోదారి మూవీకి ఇళయరాజానే మ్యూజిక్ అందించారు. అందులో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ సాధించాయి. ఆడియన్స్కి ఎంతో ఫేమస్ అయిన నను నీతో సాంగ్ పాడింది ఇళయరాజా కూతురు భవతారిణినే.
Upon hearing the heartbreaking news, I visited @ilaiyaraaja garu to convey my deepest condolences to him and his family on the tragic loss of his daughter Bhavatharini.
— Mohan Babu M (@themohanbabu) January 30, 2024
I pray that the almighty gives his family the strength to withstand this tragic moment. pic.twitter.com/3DxTCyYEE5