బతకలేని తెలంగాణగా మార్చిన కేసీఆర్ : మోహన్​రావు పటేల్

బతకలేని తెలంగాణగా మార్చిన కేసీఆర్ :  మోహన్​రావు పటేల్

భైంసా, వెలుగు  : బంగారు తెలంగాణ చేస్తానని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్​సర్కార్​బతకలేని తెలంగాణగా మార్చారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్​అన్నారు. శనివారం భైంసా మండలంలోని చుచుంద్, పాంగ్రి గ్రామాల్లో కేంద్ర పథకాలపై ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 మిగులు బడ్జెట్​ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్​ దుబారా ఖర్చులు చేసి అప్పుల పాలు చేశారని ఆరోపించారు. కేంద్ర పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్​జాదవ్, లీడర్లు దిలీప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.