ఇంటి య‌జ‌మాని వేధింపులు భ‌రించ‌లేక మహిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

ఇంటి య‌జ‌మాని వేధింపులు భ‌రించ‌లేక మహిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల‌ 25వ తేది అత్మహత్య చేసుకున్నమహిళ కేసును మొయినాబాద్  పోలీసులు ఛేదించారు. ప్రాథ‌మికంగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు తమ విచారణలో త‌న య‌జ‌మాని వేధింపులు భ‌రించ‌లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. యువతి అత్మహత్యకు కారకుడైన బాతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు

ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. మొయినాబాద్ పొలీస్ స్టేషన్ పరిధిలోని హిమయత్ సాగర్ లో భతుకు మధుసుదన్ యాదవ్ ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు అక్కాచెల్లెలను తరుచు లైంగిక వేదించేవాడు అతని బాధలు భరించలేక చెల్లెలు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఈనెల 25వ తేది అత్మహత్య చేసుకుని మృతి చెందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, మధుసుదన్ ఇచ్చే జీతం డబ్బులను తండ్రికి ఇచ్చే వాళ్ళు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అయితే ఈ నెల 24వ తేది రాత్రి 10గంటలకు పని నిమిత్తం చెల్లెల్ని మేడపైకి తీసుకెళ్ళాడు. తెల్లవారే సరికి ఆ యువ‌తి ప్యానుకు ఉరి వేసికుని అత్మహత్య చేసుకుంది. అయితే, తన చెల్లెలు కడుపునొప్పి భరించలేక అత్మహత్య చేసుకుందని చెప్పాల్సిందిగా మృతురాలి అక్కకు మధుసుదన్ వార్నింగ్ ఇచ్చాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మొయినబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఉస్మానియా మార్చరీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధుసుదన్ పెట్టే లైంగిక వేధింపులు భరించలేక తన చెల్లెలు చనిపోయిందని మృతురాలి అక్క పొలీసులకు వెల్లడించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుసుదన్ ను అదుపులోకి తీసుకున్న అతనిపై నిర్భయ కేసుతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడిపై గతంలో మొయినాబాద్ పొలీసుస్టేషన్ లో రౌడిషీట్ ఉన్నట్లు శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.