కంటివెలుగు శిబిరంలో కోతులు హల్చల్

 కంటివెలుగు శిబిరంలో కోతులు హల్చల్

మహబూబాబాద్ జిల్లాలోని కంటివెలుగు శిబిరంలో కోతులు హల్చల్ చేశాయి. నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామంలోని స్కూల్లోకి కోతులు చొరబడ్డాయి. శిబిరంలోని కాగితాలను, కళ్లద్దాలను, ఇతర సామాగ్రిని చెల్లాచెదురుగా పడేశాయి. దీంతో కళ్లద్దాలు,  ఇతర సామాగ్రి ధ్వంసమైంది. 

ఏప్రిల్ 23వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో కంటి శిబిరాన్ని అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో స్కూల్ కిటికీల్లోంచి కోతులు లోపలికి వెళ్లాయి. రూమ్ మొత్తాన్ని కిష్కింద కాండ చేశాయి. సరైన సౌకర్యాలు లేని రూంలో కంటివెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్లే.. ఈ పరిస్థితి నెలకొందని మెడికల్ సిబ్బందిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.