తోటి వాళ్లకే ఆపదొస్తే పట్టించుకోని మనుషులున్న ఈ రోజుల్లో మనిషికి ఆపదొచ్చిందని ఓ మూగ జీవి సాయం చేసింది. మనసును కదిలించేలా ఉన్న ఈ ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్గా మారాయి.
మనుషుల్లో మానవత్వాన్ని తట్టి లేపేలా ఉన్నా ఈ దృశ్యాలకు సంబంధించిన వార్తే ఇది.. ఇండోనేసియాలోని ఒరాంగుటన్ సర్వైవల్ఫౌండేషన్కి చెందిన ఓ సంరక్షకుడు పాములు పట్టుకునేందుకు ఓ అడవిలోని మడుగులోకి దిగాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ఓరాంగుటన్(కోతి జాతుల్లో రకం) అతను మడుగులో మునిగిపోతున్నాడని భావించింది. వెంటనే మడుగు దగ్గరకు వచ్చి ఆ సంరక్షకుడికి తన చేతిని అందించింది. దాని చేతి సాయంతో అతను ఒడ్డుకు చేరుకున్నాడు.
ఒరాంగుటన్ చేయి అందిస్తున్న దృశ్యాన్ని టూరిస్ట్ అనిల్ ప్రభాకర్ఫొటో తీశారు. మనిషిని కాపడటానికి 'మే ఐ హెల్ప్యూ' అనేలా చేయి అందిస్తున్న ఆ మూగ జీవిని చూస్తే జంతువుల్లో మనుషుల కంటే ఎక్కువ మానవత్వం ఉందని అనిపించిందని ఇంతకు మించి ఉదాహరణ ఇంకేం కావాలని ఆయన అన్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.