గండిపేట్, వెలుగు : ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిరేవుల ప్రాంతానికి చెందిన టి. మల్లేశ్ తన భార్య, పిల్లలు అనిరుధ్(7), అనీశ్ ఏడాదిన్నర బాబుతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల1వ తేదీన తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో మల్లేశ్ భార్య, పిల్లల కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికాడు. బంధువులు, స్నేహితుల వద్ద కూడా ఎలాంటి ఆచూకీ లభించపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.