LasyaNanditha:లాస్య మరణ వార్త విని స్పృహతప్పి పడిపోయిన తల్లి

LasyaNanditha:లాస్య మరణ వార్త విని స్పృహతప్పి పడిపోయిన తల్లి

హైదరాబాద్ ఓఆర్ఆర్ కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందిన విషాదకర ఘటన ఫిబ్రవరి 23న చోటుచేసుకుంది. లాస్య మరణవార్త విన్న ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లాస్య తల్లి కూతురు మరణాన్ని తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయారు. ఇటీవల వరుస ప్రమాదాలనుంచి బయటపడిన లాస్య.. సదాశివపేట వెళ్లి వస్తుండగా.. ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ప్రమాదంలో మృతిచెందారు.

ముందు కారును తప్పించబోయి రెయిలింగ్ కు కారు ఢీకొనడంతో లాస్య అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రగాయాలయ్యాయి. 2023 ఫిబ్రవరి  19న లాస్య నందిత తండ్రి.. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గుండెపోటుతో మృతిచెందారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్య నందిత ఎన్నికయ్యారు. తండ్రి మరణించని ఏడాదిలో లోపు లాస్య నందిత మృతిచెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.