తల్లి ఫిర్యాదు : కొడుకు, కోడలికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష

తల్లి ఫిర్యాదు : కొడుకు, కోడలికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష

హైదరాబాద్ : తల్లిని వేధిస్తున్న కొడుకుకి జైలు శిక్ష, ఫైన్ పడింది. భర్తలో సగభాగం పంచుకున్న కోడలికి కూడా శిక్ష పడేలా చేసింది ఓ ముసలవ్వ. కన్న కొడుకే కోడలితో కలిసి తనను వేధిస్తున్నాడని .. ఇంటి నుంచి నన్ను వెళ్లగొడుతున్నారంటు పోలీసులకు ఫిర్యాదు చేసింది 70 సంవత్సరాల వృద్ధురాలు. 2015లోనే  నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో తల్లి ఫిర్యాదు మేరకు కొడుకు అమిత్ కుమార్, కోడలు సబితా లావణ్య లపై నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు విచారణ జరిపిన కోర్టు సోమవారం వారిద్దరికీ రెండు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది.

వివరాలు ఇలా ఉన్నాయి..

నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కాలనీలో నివాసం ఉండే ప్రేమ కుమారి 70 సంవత్సరాల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. 2015 సంవత్సరంలో భర్త చనిపోయాడు, భర్త చనిపోకముందే పిల్లల వివాహాలు జరిపించాడు. ఎవరికి వారు వేరు కాపురాలు ఉంటున్నారు. భర్త చనిపోవడంతో పెద్ద కుమారుడు నుంచి తల్లికి వేధింపులు మొదలయ్యాయి. ముషీరాబాద్ లో నివాసం ఉండే పెద్ద కుమారుడు అమిత్ కుమార్ భార్యతో సహా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించమే కాకుండా.. తల్లిని బలవంతంగా బయటకు పంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని భార్యతో కలిసి హింసించడం మొదలుపెట్టాడు. ఇది భరించలేని తల్లి, 2015 సంవత్సరంలో నేరేడ్మెట్ పోలీసులను ఆశ్రయించగా.. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు సంవత్సరాలు పాటు కోర్టులో నడిచిన కేసు.. సోమవారం తీర్పును సంచనల తీర్పు చెప్పింది.  పెద్ద కుమారుడు అమిత్ కుమార్, కోడలు లావణ్యలకు రెండు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు.. రూ 10 వేల రూపాయల జరిమానా విధించింది. తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా..వేధించిన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించింది కోర్టు.