రూ.15 కోట్లతో రిపేర్ చేసినా ఉరుస్తుంది

రూ.15 కోట్లతో రిపేర్ చేసినా ఉరుస్తుంది

దాదాపు 9 నెలలపాటు రూ. 15 కోట్లతో హైదరాబాద్లోని మొజాంజాహీ మార్కెట్ కు రిపేర్లు చేసినా ఫలితం కనిపించడం లేదు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మార్కెట్ బిల్డింగ్ ఉరుస్తున్నది. పైకప్పు నుంచి వర్షపు  నీళ్లులీకవడంతో సీలింగ్, లోపలి గోడలకు మొత్తం చెమ్మ పట్టింది . ఇన్నాళ్లు రిపేర్లపేరుతో కోట్లుఖర్చుపెట్టి కేవలం రాతి గోడను శుభ్రం చేశారని, పైకప్పును పట్టించుకోలేదని వ్యాపారులు విమర్శిస్తున్నారు. ఈ నెల 14న మొజాంజాహీ మార్కెట్ను మంత్రి కేటీఆర్ పరిశీలించి.. ఇలాంటి చారిత్రక కట్ట డాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే రూ. 15 కోట్లతో రిపేర్లు చేయించినట్లు చెప్పారు.

గేట్లన్నీ ఓపెన్ భారీ వర్షాలతో గోదావరిలోకి ఫుల్ వరద