బోగస్​ ఓట్లపై విచారణ జరపండి : అర్వింద్

బోగస్​ ఓట్లపై విచారణ జరపండి : అర్వింద్
  •      రాష్ట్ర  ఎన్నికల  అధికారికి  ఎంపీ అర్వింద్​ ఫిర్యాదు

బోధన్, వెలుగు : పట్టణంలో వెలుగు  చూసిన బోగస్​ ఓట్ల ఉదంతంపై ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్​లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ను కలిసి ఫిర్యాదు చేశారు.  బోగస్​ ఓట్లపై స్పెషల్ అధికారిని నియమించి పరిశీలన జరుపాలన్నారు.  స్పందించిన  ఎన్నికల ప్రధాన అధికారి  ఐఏఎస్ అడాక్టర్​ క్రిస్టినా  జెడ్​ చోంగ్దు నియమించి ఓటరు ప్రక్రియను పరిశీలిస్తామని తెలిపారు.

ALSO READ: ప్రభుత్వ హాస్పిటల్స్​లో మెరుగైన వైద్యం : పోచారం  శ్రీనివాస్​రెడ్డి

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ బోగస్​ ఓట్ల  ఉదంతాన్ని  గుర్తించి వెలుగులోకి తెచ్చిన  బీజేపీ నాయకులకు, కార్యకర్తలు అభినందించారు.  కార్యక్రమంలో ఎలక్షన్​ ఎపైర్స్​  కమిటీ చైర్మన్ మర్రి  శశిధర్​ రెడ్డి,  రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి  ప్రకాష్  రెడ్డి, వడ్డీ  మోహన్​ రెడ్డి , సీనియర్​ అడ్వికేట్​ అంటోని రెడ్డి పాల్గొన్నారు.