ప్రభుత్వ హాస్పిటల్స్​లో మెరుగైన వైద్యం : పోచారం  శ్రీనివాస్​రెడ్డి

ప్రభుత్వ హాస్పిటల్స్​లో మెరుగైన వైద్యం : పోచారం  శ్రీనివాస్​రెడ్డి
  •     కామారెడ్డి మెడికల్ కాలేజీని వర్చువల్​ సిస్టమ్​ ద్వారా ప్రారంభించిన సీఎం
  •      పాల్గొన్న స్పీకర్,  ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు

కామారెడ్డిటౌన్​, వెలుగు : ప్రభుత్వ హాస్పిటల్స్​ ద్వారా ప్రజలకి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట  ప్రభుత్వం కృషి చేస్తోందని  స్పీకర్​ పోచారం  శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు.  శుక్రవారం వర్చువల్​ విధానంలో సీఎం కేసీఆర్​ కామారెడ్డి మెడికల్  కాలేజీని ప్రారంభించారు. అనంతరం సీఎంకు కృతజ్నతలు తెలుపుతూ  బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో  భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి  మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.  

విప్​ గంప గోవర్ధన్​  మాట్లాడుతూ.. ప్రస్తుతం  కాలేజీ తో పాటు 350  బెడ్స్​ హాస్పిటల్​ వచ్చిందని త్వరలో 500 బెడ్స్​ హాస్పిటల్ వస్తుందన్నారు.  కలెక్టర్​  జితేశ్​ పాటిల్​ మాట్లాడుతూ.. వైద్య విద్యను ఎంచుకున్న స్టూడెంట్స్​ కష్టపడి చదవి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.  కామారెడ్డి జిల్లా  మంచి కేంద్రమని,  స్టూడెంట్స్​కు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు.

ALSO READ: జోగు రామన్న అబద్దపు ప్రచారాలు మానుకోవాలి: ​సుహాసినీరెడ్డి

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హన్మంతుషిండే, జాజాల సురేందర్,  జడ్పీ ఛైర్​పర్సన్​ దఫేదర్​ శోభ,  స్టేట్​ ఉర్ధు ఆకాడమీ ఛైర్మన్​ ఎం.కె. ముజీబొద్ధిన్​, డీసీసీబీ ఛైర్మన్​ భాస్కర్​రెడ్డి, జిల్లా లైబ్రరీ ఛైర్మన్​ పున్న రాజేశ్వర్,  మున్సిపల్​ ఛైర్​ పర్సన్​ నిట్టు జాహ్నవి,   ఎస్పీ బి. శ్రీనివాస్​రెడ్డి,  కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్​ వెంకటేశ్వర్, అడిషనల్​ కలెక్టర్లు  మధుచౌదరి,  చంద్రమోహన్​,  ప్రొఫెసర్లు, మెడిసిన్​ స్టూడెంట్స్​ తదితరులు పాల్గొన్నారు.