దీక్ష పేరుతో హోటల్లో పత్తాలాడుతున్నరు

దీక్ష పేరుతో హోటల్లో పత్తాలాడుతున్నరు

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా దీక్ష చేపట్టడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న బీజేపీ రైతు దీక్షలో పాల్గొన్న ఆయన.. ముఖ్యమంత్రి వైఖరిని ఎండగట్టారు. కేసీఆర్ను లోపలేయడం బీజేపీకి పెద్ద పని కాదన్న అర్వింద్.. 16 ఎంపీ సీట్లతో ఆయన దేశ్ కీ నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీ కేసీఆ బాప్ అయితే అసదుద్దీన్ బాప్ బండి సంజయ్ అని అన్నారు. ధర్నా పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ అశోకా హోటల్ లో పత్తాలాడుతున్నారని విమర్శించారు. కాకినాడ పోర్టు నుంచి కేసీఆర్ ధాన్యం బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. నరేంద్ర మోడీతోనే రైతు రాజ్యం సాధ్యమని అన్నారు.