ఎన్నికల్లో కాంగ్రెస్ లీడర్లకు..కేసీఆరే ఫండింగ్ చేస్తరు: ఎంపీ అర్వింద్

ఎన్నికల్లో కాంగ్రెస్ లీడర్లకు..కేసీఆరే ఫండింగ్ చేస్తరు: ఎంపీ అర్వింద్

బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆరే ఫండింగ్ చేయనున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని సీఎం కేసీఆరే కాపాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్​లో నాయకులను ఆయనే పంపిస్తున్నారని విమర్శించారు.

బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో మీడియాతో అర్వింద్​ మాట్లాడారు. నిజామాబాద్​లో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ పై కేసీఆర్ సమాధానం‌ చెప్పాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు చెప్పారు. కాగా, సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు. సొంత కుటుంబ సభ్యులతో కేసీఆర్​కు ప్రమాదం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. 

కేసీఆర్ ఏమయ్యాడోనన్న పరేషానీ తమకుందని, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన హక్కు తెలంగాణ ప్రజలకు ఉందన్నారు.