ఎన్నిసమస్యలు వచ్చినా కార్మికుల పోరాటానికి మద్దతిస్తా

ఎన్నిసమస్యలు వచ్చినా కార్మికుల పోరాటానికి మద్దతిస్తా

కేసీఆర్ నియంతృత్వ ధోరణి వల్లే కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు ఎంపీ బండి సంజయ్. మహబూబాబాద్ లోఆర్టీసీ డ్రైవర్ నరేష్  ఆత్మహత్య చేసుకోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు 40 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికులు ప్రాణాలు తీసుకుంటున్నా కేసీఆర్ లో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. కార్మికులెవరూ కూడా అధైర్యపడొద్దన్నారు. ఎన్నిసమస్యలు వచ్చినా కార్మికుల పోరాటానికి మద్దతిస్తానన్నారు.