నా పేరు బండి సంజయ్.. నేను కరీంనగర్ ఎంపీని

నా పేరు బండి సంజయ్.. నేను కరీంనగర్ ఎంపీని

కరీంనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. కొంతమంది అధికారులు తనను గుర్తుపట్టడంలేదని… నా పేరు బండి సంజయ్, నేను కరీంనగర్ ఎంపీనని పరిచయం చేసుకున్నారు. జిల్లా అభివృద్ధి కోసం జరిగే సమావేశం  మొక్కుబడిగా జరగరాదని ఆయన అన్నారు. కేంద్ర నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులను .. ఇవి కేంద్ర స్కీంలు అని ప్రజలకు అధికారులు చెప్పడం లేదని అన్నారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి సాధ్యమని.. లోటు పాట్లను సవరించుకుని ముందుకు సాగుదామని అధికారులతో సంజయ్ చెప్పారు.. సమావేశానికి వచ్చే ముందు మొక్కుబడి నివేదికలతో రావద్దన్న ఆయన.. అధికారులిచ్చే సూచనలను స్వీకరిస్తామని.. కేంద్ర ప్రభుత్వం తరపున  ఎలాంటి సహాయం కావాలో కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ మీటింగ్ కు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతరావు, కలెక్టర్ శశాంక, జిల్లా అధికారులు పాల్గొన్నారు.