కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటును కుదిపేసే పెద్ద తప్పు చేశాడు..

కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటును కుదిపేసే పెద్ద తప్పు చేశాడు..

కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఓ పెద్ద తప్పు చేశాడని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ పార్లమెంటును ఎలా తప్పుదారి పట్టించాడో త్వరలోనే ప్రజలకు తెలియజేస్తామని ఆయన అన్నారు. అందుకోసం లోక్‌సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ స్పీకర్ పర్మిషన్ ఇస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు చెబుతామని ఆయన అన్నారు. అదే జరిగితే కేసీఆర్ బండారం బయటపడుతుందని ఆయన అన్నారు. ‘కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద తప్పిదం చేశాడు. ఆ అంశం పార్లమెంటును కచ్చితంగా కుదిపేస్తుంది. విషమేంటనేది మాత్రం ఇప్పుడు అడగొద్దు’ అని విలేకరులతో ఏర్పాటు చేసిన చిట్‌చాట్‌లో ఎంపీ బండి సంజయ్ అన్నారు.