- ఎన్సీబీసీ చైర్మన్ హన్స్రాజ్ కు ఎంపీ బీబీ పాటిల్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని వెనుకబడిన తరగతులను వెంటనే జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగరాం ఆహీర్ కు ఎంపీ బీబీ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
బుధవారం ఢిల్లీలోని ఎన్సీబీసీ కార్యాలయంలో హన్స్రాజ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు చెందిన 40 కులాలతో పబ్లిక్ హియరింగ్ను నిర్వహించాలని కోరారు. ఈ మేరకు కేంద్రం సూచనలు, సిఫార్సులు పంపాలని విజ్ఞప్తి చేశారు.