తెలంగాణలో బీసీలను ఓబీసీ జాబితాలో చేర్చాలి

తెలంగాణలో బీసీలను ఓబీసీ జాబితాలో చేర్చాలి
  • ఎన్సీబీసీ చైర్మన్ హన్స్​రాజ్ కు ఎంపీ బీబీ పాటిల్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ,  వెలుగు: తెలంగాణలోని వెనుకబడిన తరగతులను వెంటనే జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్​రాజ్ గంగరాం ఆహీర్ కు ఎంపీ బీబీ పాటిల్ విజ్ఞప్తి చేశారు. 

బుధవారం ఢిల్లీలోని ఎన్సీబీసీ కార్యాలయంలో హన్స్​రాజ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు చెందిన 40 కులాలతో పబ్లిక్ హియరింగ్​ను నిర్వహించాలని కోరారు. ఈ మేరకు కేంద్రం  సూచనలు, సిఫార్సులు పంపాలని విజ్ఞప్తి చేశారు.