
- బీజేపీ లీగల్ సెల్ ద్వారా కోర్టు డైరెక్షన్స్ పొందాలి
- ఆ బాధ్యత కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలి
- 29న అమిత్షా రాక, పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం
నిజామాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకుని బీజేపీ లీగల్ సెల్ను యాక్టివ్చేయాలని, వారి ద్వారా కోర్టు నుంచి డైరెక్షన్స్ పొందాలని సూచించారు. సోమవారం ఆయన నిజామాబాద్లోని బీజేపీ జిల్లా పార్టీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సీబీఐ విచారణ కోరే పరిస్థితి కనిపించడంలేదని, రాష్ట్ర బీజేపీ ముఖ్యనాయకులైన కేంద్ర మంత్రులు ఈ విషయంలో భరోసా ఇవ్వాలని ఇదివరకే తాను ట్విట్టర్వేదికగా కోరినట్టు గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు చాలామంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయన్నారు.
కల్వకుంట్ల ఫ్యామిలీని జైళ్లో వేస్తే మరిన్ని స్కామ్లు బయటకు
తెలంగాణ సమాజం కల్వకుంట్ల ఫ్యామిలీని ఎప్పటికీ క్షమించదని, వారందరినీ రప్పా రప్పా జైళ్లో వేయాలని అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కాళేశ్వరం స్కామ్, కవిత లిక్కర్ స్కామ్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా–ఈ కార్ రేస్, హరీశ్ రావు విద్యుత్ స్కామ్కు పాల్పడ్డారన్నారు. వారిని అరెస్ట్ చేస్తే మరిన్ని స్కామ్లు బయటకొస్తాయన్నారు. వారిని లోపలవేయకుంటే సీఎం రేవంత్రెడ్డి అన్పాపులర్ అవుతారని అన్నారు. బీఆర్ఎస్ 3.0 జరిగే పనికాదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మూడు సీట్లు గెలవడం కూడా అనుమానమేనన్నారు. కేసీఆర్పోటీ చేయడని, హరీశ్ ఒక్కడు గెలిస్తే గెలవొచ్చన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ పక్కాగా ఓడిపోతాడని, అతని చెల్లి పొలిటికల్ కెరీర్కు ఎండ్ కార్డు పడబోతుందన్నారు.
29న పసుపు బోర్డు ఆఫీస్ ఓపెనింగ్
29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా నిజామాబాద్ కు వస్తున్నారని, జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ను ప్రారంభించి.. పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే సభలో పాల్గొంటారని అర్వింద్తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ఇస్తే పసుపుబోర్డ్కు శాశ్వత భవనం నిర్మిస్తామన్నారు. బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన డి.శ్రీనివాస్ విగ్రహాన్ని కూడా అమిత్షా ఆవిష్కరిస్తారని చెప్పారు. విగ్రహ ప్రతిష్టాపనకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నేషనల్ పసుపు బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నేతలు దినేశ్ కులాచారి, స్రవంతిరెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.