కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరాటం వెలకట్టలేనిది

కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరాటం వెలకట్టలేనిది

అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని జరుపుతామని ఉద్యమంలో ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చిండని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

హైదరాబాద్ నుండి నిజాం, రజాకార్లను తరిమికొట్టడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరాటం వెలకట్టలేనిదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్టలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.