
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటమి భయం
- బీసీ సీఎం ప్రకటనతో వాళ్లకు నిద్రపట్టట్లే: లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు : బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అందుకే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని విమర్శించారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్లు బీసీ డిక్లరేషన్ ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్లో లక్ష్మణ్ మాట్లాడారు. బీసీలను కాంగ్రెస్ దూరంగా నెట్టేస్తే.. మోదీ అక్కున చేర్చుకున్నారన్నారు. విశ్వకర్మ యోజన స్కీమ్తో ఎన్నో బీసీ కులాలకు లబ్ధి చేకూరుస్తున్నారని తెలిపారు.
బీసీల నుంచి 26 కులాలను బీఆర్ఎస్ తొలగించిందన్నారు. బీసీ సీఎం ప్రకటన తర్వాత రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్లో అందరూ సీఎం పోస్టు కోసం పోటీపడ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో నల్గొండ జిల్లా వాళ్లే ఎక్కువగా ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఆ తర్వాత హిమాన్షు సీఎం అవుతాడని అన్నారు. బీజేపీలో మాత్రం బీసీ సీఎం అవుతాడని తెలిపారు. ఇన్నేండ్లు పాలించిన కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీసీని ఎందుకు సీఎం చేయలేదని ప్రశ్నించారు.