
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతదేహానికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నివాళులు అర్పించారు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి సాయన్న అని కొనియాడారు. ఎమ్మెల్యేగా 5 సార్లు గెలవడం అంటే ఆషామాషీ విషయం కాదని చెప్పారు. తాము కలిసి పనిచేసిన సందర్భాలు ఎన్నో అని చెప్పిన లక్ష్మణ్...తమ అనుబంధం దశాబ్దాలదని అన్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని , ఆయన ఆత్మ శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని లక్ష్మణ్ తెలిపారు. కాగా కంటోన్మెంట్ నుంచి సాయన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి నాలుగు సార్లు గెలవగా.. 2018లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.