42 శాతం రిజర్వేషన్ల జీవో ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి : ఎంపీ ఆర్ .కృష్ణయ్య

42 శాతం రిజర్వేషన్ల జీవో ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి : ఎంపీ ఆర్ .కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: బీసీలకు రిజర్వేషన్లు భిక్షం కాదని... రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే జీవో తెచ్చిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లక్డీకాపూల్​లో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో 90 బీసీ కుల సంఘాలు,  30 బీసీ సంఘాల నేతలు పాల్గొనగా ముఖ్య అతిథిగా ఎంపీ ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డీ6 ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కేసులో 50శాతం సీలింగ్ ఎత్తివేసిందని.. అందువల్ల రిజర్వేషన్ల పెంపుపై ఎలాంటి అడ్డంకులు ఉండవని చెప్పారు