గ్రూప్స్ పోస్టులు పెంచాలి : ఆర్.కృష్ణయ్య

గ్రూప్స్ పోస్టులు పెంచాలి : ఆర్.కృష్ణయ్య
  •     నిరుద్యోగుల సదస్సులో ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖల్లో సమగ్ర విచారణ జరిపి, ఖాళీగా ఉన్న గ్రూప్–1, 2, 3, 4 పోస్టులను పెంచి నోటిఫికేషన్లు రిలీజ్​చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే ప్రతి స్కూలులో సరిపడా టీచర్లు ఉండేలా 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. 

శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్ లో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అనంతయ్య, కర్ణశ్రీ అధ్యక్షతన నిరుద్యోగ విద్యార్థుల సదస్సు జరిగింది. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. తక్కువ పోస్టులతో గ్రూప్–2, గ్రూప్–3 నోటిఫికేషన్లు విడుదల చేశారన్నారు. కొందరు ఉన్నతాధికారులు పోస్టులను లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పదేండ్లుగా గ్రూప్–1 సర్వీస్ కింద పోస్టులు భర్తీ చేయలేదని, ఎంతోమంది రిటైర్డ్ అయ్యారని, గ్రూప్ 2 సర్వీస్ కింద పూర్తిస్థాయి రిక్రూట్మెంట్ జరగలేదని, గ్రూప్–4 జూనియర్ అసిస్టెంట్, జిల్లా ఆఫీస్సర్ల పోస్టులను భర్తీ చేయకపోవడం దారుణమన్నారు