రామచంద్రాపురం, వెలుగు: బీహెచ్ఈఎల్పరిధిలోని ఎంఐజీ కాలనీ నుంచి రేడియల్రోడ్డు 7 కు కనెక్టివిటీ కల్పిస్తామని మెదక్ఎంపీ రఘునందన్రావు హామీ ఇచ్చారు. తెల్లాపూర్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఎంఐజీ కాలనీ, తెల్లాపూర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యలపై కాలనీ అసోసియేషన్లు, గ్రామ పెద్దలతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంఐజీ నుంచి రేడియల్ రోడ్డుకు మధ్యలో రైల్వే ట్రాక్ ఉండటం వల్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తామన్నారు. ఎంఎంటీఎస్ రైల్ సర్వీస్ను తెల్లాపూర్ నుంచి ఈదులనాగులపల్లి వరకు పెంచేందుకు ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఎంఐజీ నుంచి తెల్లాపూర్ వైపు రైల్వే అండర్ బ్రిడ్జి చిన్నగా ఉండటం వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఈ విషయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి సోమన్నతో చర్చలు జరిపి మరో ఆర్యూబీ నిర్మాణానికి అనుమతులు తెచ్చినట్లు వివరించారు.
పెరిగిన అవసరాలకు అనుగుణంగా హైటెన్షన్ లైన్ల కింద సీవరేజ్ పైప్ లైన్లు, తాగునీటి లైన్ల నిర్మాణాలపై అధికారులతో చర్చలు జరుపుతానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఐజీ సొసైటీ ప్రెసిడెంట్అ బ్ధుల్అజీమ్, జగన్మోహన్, వెంకటయ్య. ఈశ్వర్, జయలక్ష్మి, సీనియర్నాయకులు నరేందర్రెడ్డి, రాజు, లచ్చిరాంనాయక్, నర్సింహారెడ్డి, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
