టీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు

టీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు

నారాయణపేట జిల్లా: కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులను మోసం చేసిన టీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. 29 ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి యువకులకు ఉద్యోగాలిచ్చిన చరిత్ర కాంగ్రెస్ దన్నారు. కక్షగట్టి తనను కొడంగల్ లో ఒడిస్తే… దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి నన్ను జనం గెలిపించారన్నారు. కొడంగల్ కు రెండేళ్లలో సాగునీరు తెస్తామన్న సన్నాసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.