నాగార్జునసాగర్ ఉపఎన్నిక దగ్గరపడుతోంది. రాష్ట్ర ప్రజల చూపంతా సాగర్ ఉపఎన్నిక మీదే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందా? అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాంతో పార్టీలన్నీ తమ అభ్యర్థి గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు తమ ప్రచారంలో దూకుడుపెంచుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థి నోముల భగత్ గెలుపుకోసం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను రంగంలోకి దించింది. దుబ్బాకలో గెలిచి, జీహెచ్ఎంసీలో సత్తాచాటిన బీజేపీ.. సాగర్లో కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి, సీనియర్ లీడర్, సాగర్ నియోజకవర్గం నుంచి గతంలో ఏడుసార్లు గెలుపొందిన జానారెడ్డిని గెలిపించుకొని.. తమ క్యాడర్ను కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో శుక్రవారం నుంచి ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం రేవంత్.. నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. దానికంటే ముందుగా రేవంత్.. సాగర్లో సూసైడ్ చేసుకొని చనిపోయిన ప్రైవేట్ టీచర్ రవి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
సాగర్ బైఎలక్షన్ ప్రచారానికి రేవంత్ రెడ్డి
- తెలంగాణం
- April 9, 2021
లేటెస్ట్
- మే 8లోగా పోలింగ్ స్లిప్పులు అందించాలి
- 13 మంది రాజన్న ఆలయ.. ఉద్యోగులపై కొరడా
- ఉపాధి కూలీలకు 150 రోజులు పని కల్పిస్తం : వంశీచంద్రెడ్డి
- జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులు షురూ
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లీడర్లు
- భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కాజీపేట రైల్వే డీజిల్ షెడ్కు అవార్డు
- కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
- కామారెడ్డి టౌన్లో పోలింగ్ శాతం పెంచాలి
- రూ. 53 లక్షల పట్టివేత
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!