ఎంపీ సోయం బాపురావుకు  కరోనా

ఎంపీ సోయం బాపురావుకు  కరోనా

ఆదిలాబాద్ జిల్లా: ఎంపీ సోయం బాపురావ్  కరోనా బారినపడ్డారు. అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వైద్యుల సలహాలు, సూచనల మేరకు  ఆయన వెంటనే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. గత రెండు రోజులుగా తనను కలిసిన వారు, సన్నిహితంగా తిరిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా నిర్ధారణ కాకపోయినా హోమ్ ఐసోలేషన్ లో ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని ఎంపీ బాపురావు సూచించారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర  ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించాలి

ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’