టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వజినేపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట గ్రామ గ్రామాన 40రోజుల పాటు కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర చేపడతామని ఉత్తమ్ తెలిపారు. 2023 మే లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశముందని చెప్పారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులను పరామర్శించడానికి  తీరికలేని సీఎం కేసీఆర్ పంజాబ్ రాష్ట్రంలో రైతులకు పరిహారం ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ ది అసమర్థ పాలన అన్న ఉత్తమ్..రాష్ట్రాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు నాయకులు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్, సాండ్, మైన్, వైన్ పేరిట గ్రామాల్లో, నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు వందల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తల కోసం

మంటలను ఆర్పేందుకు రోబోలు

సీఎం కేసీఆర్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు