మేళ్లచెరువు, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచే పోటీ చేస్తానని ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి వేపలమాధారం, రామాపురం గ్రామాల్లో శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసుల ఆగడాలు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని వడ్డీతో సహా బదులిస్తానని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ లేనంతగా అరాచకాలు, భూకబ్జాలు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. వీటన్నింటిని చూసే.. వాటిని ఆపేందుకే ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.