
ఢిల్లీ: రాహుల్ గాంధీకి బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. రాహుల్ పై వ్యక్తిగత విమర్శలు కరెక్ట్ కాదన్నారు. బుధవారం ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. " కుల గణన వల్లే రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. అందుకే కుల గణన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
కానీ, రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ, అనురాగ్ ఠాకూర్ వ్యక్తిగత విమర్శలు చేశారు. దీన్ని మేం ఖండిస్తున్నం. నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమాధానంలో కూడా తప్పులు ఉన్నాయి. కేవలం 8 లక్షల ఉద్యోగాలే ఇచ్చామని ఆరు నెలల కింద చెప్పారు. ఇప్పుడు మాట మార్చారు. నిరుద్యోగ సమస్యపై మా పోరాటం ఆగదు' అని గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.