- మంత్రి శ్రీధర్బాబు, చీఫ్ సెక్రటరీకి ఎంపీ వంశీకృష్ణ లెటర్
పెద్దపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అలాగే మంచిర్యాలకు చెందిన ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లా గోదాముల్లో తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, చీఫ్ సెక్రటరీకి మంగళవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లెటర్ రాశారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో స్పీడ్గా కొనుగోళ్లు చేయాలని ఎంపీ కోరారు.
