తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం : విజయసాయి రెడ్డి

తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం : విజయసాయి రెడ్డి

సీని నటుడు నందమూరి తారకరత్న మృతిపట్ల వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంతాపం తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కానీ విధి మరోలా తలచిందని ఆయన ట్వీట్ చేశారు. తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమన్న ఆయన.. అతని  ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రార్థిస్తున్నానని.. అభిమానులకు ప్రగాఢ సానుభూతి అని పోస్ట్ చేశారు. కాగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో గత 23 రోజులుగా చికిత్స  పొందుతూ తారకరత్న  కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.  జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. లోకేష్‌ తో కలిసి పాదయాత్ర చేస్తుండగా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన ట్రీట్ మెంట్ కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూ తారకరత్న తుదిశ్వాస విడిచారు.