ఓటు తొలగించారని.. పీఎస్ లో ఫిర్యాదు

ఓటు తొలగించారని.. పీఎస్ లో ఫిర్యాదు

బిజినేపల్లి, వెలుగు: మండల పరిధిలోని నందివడ్డెమాన్‌ గ్రామానికి చెందిన మక్కలపల్లి సీను పేరు ఓటరు లిస్టులో లేదని అధికారులు నామినేషన్‌ను తిరస్కరిం చారు. పార్లమెంట్ ఎన్ని కల్లో వినియోగిం చుకున్న ఓటును ఎలా తొలగిస్తారని ఆయన సోమవారం పోలీసుస్టేషన్‌లో కాంప్లయింట్‌ చేశాడు. నందివడ్డెమాన్‌ ఎంపీటీసీగా నామినేషన్‌ వేసిన సీనుకు టీఆర్‌ఎస్‌ బీఫాం కూడా ఇచ్చింది.