IPL 2024: రికార్డు సృష్టించిన ధోనీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు

IPL 2024:  రికార్డు సృష్టించిన ధోనీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఏప్రిల్ 14, ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని కేవలం నాలుగు బంతుల్లో 3 వరుస సిక్సులతో చెలరేగి 20 పరుగులు చేశాడు.

హార్దిక్ పాండ్యా వేసిన 20వ ఓవర్‌లో వరుసగా మూడు బంతుల్లో 3 సిక్సులతో విరుచకుపడడంతో సీఎస్ కే 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఐపీఎల్‌లో తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లో సిక్సులు కొట్టిన తొలి ఇండియన్ క్రికెటర్ గా ధోని రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు మరే క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు.  మొత్తంమీద ఐపీఎల్ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని సాధించిన మూడో ఆటగాడు ధోని నిలిచాడు.  ధోనీ కంటే ముందు సునీల్ నరైన్, నికోలస్ పూరన్ ఉన్నారు. 2021లో KKR vs RCB మ్యాచ్ లో సునీల్ నరైన్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఇక, 2023లో LSG vs SRH  మ్యాచ్ లో16వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది నికోలస్ పూరన్ ఈ ఘనత సాధించాడు.