ధోనీ అకాడమీ ఆధ్వర్యంలో స్కూల్​ ప్రీమియర్​ లీగ్

ధోనీ అకాడమీ ఆధ్వర్యంలో స్కూల్​ ప్రీమియర్​ లీగ్

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణలో టాలెంటెడ్​ క్రికెటర్లను గుర్తించి, ప్రోత్సహించేందుకు ​ మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హేంద్ర సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధోనీ క్రికెట్ అకాడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీ (ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీఏ) ముందుకొచ్చింది. స్కూల్​ ప్రీమియర్​ లీగ్​ పేరిట యంగ్​స్టర్స్​ కోసం టీ20 లీగ్​ను ప్రకటించింది. బ్రైనియాక్స్ బీ, ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లవి ఫౌండేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ సపోర్ట్​తో అండర్​14 బాయ్స్​, అండర్​ 16 గర్ల్స్​ కేటగిరీల్లో ఎనిమిది జట్లతో  ఆగస్టు 27 నుంచి  స్కూల్​ లీగ్ తొలి సీజన్​​ నిర్వహించనుంది. 

ఈ లీగ్​ కోసం ఆగస్టు 20న నాచారంలో డీపీఎస్​ క్యాంపస్​​లోని ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీఏ హైపెర్ఫామెన్స్​ సెంటర్​లో  సెలక్షన్​ ట్రయల్స్​ జరగనున్నాయి. ట్రయల్స్​లో పాల్గొనేందుకు ఆగస్టు 17వ తేదీలోపు రిజిస్టర్​  చేసుకోవాలని ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లవి, డీపీఎస్ (నాచారం) విద్యాసంస్థల  సీఓఓ మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్కా య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీ తెలిపారు. రిజిస్ట్రేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ల కోసం 7396386214, 7618703508 నెంబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్లలో సంప్రదించాలన్నారు.  

లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటిన టాప్​5 ప్లేయర్లకు హైదరాబాద్​లోని ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీఏ సెంటర్​లో  ఆరు నెలల ఫ్రీ కోచింగ్​తో పాటు, ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లవి ఫౌండేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ ద్వారా రూ.5 ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షల  స్కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ అందిస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రకటించారు.