
టీమిండియా మాజీ కెప్టెన్.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ తన ఐకానిక్ ట్యాగ్ 'కెప్టెన్ కూల్' ట్రేడ్మార్క్ను రిజిస్టర్ చేసుకున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ టీమిండియా మాజీ నాయకుడు జూన్ 5, 2023న జార్ఖండ్లో ట్రేడ్మార్క్ను దాఖలు చేశాడు. దరఖాస్తు సమాచార చిత్రం సోషల్ మీడియాలో కనిపించడంతో వైరల్ గా మారుతుంది. వైరల్ అయిన పోస్ట్ ప్రకారం, భారత మాజీ కెప్టెన్ జూన్ 5న రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా టైటిల్ కోసం ట్రేడ్మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ALSO READ | Aakash Chopra: మీ వోడి కంటే అతడే గొప్ప: ఆల్ ఫార్మాట్ ప్లేయర్పై ఆకాష్ చోప్రా, మైకేల్ వాన్ గొడవ
ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ ప్రకారం.. ఈ ట్రేడ్మార్క్ జూన్ 16, 2025న అధికారిక ట్రేడ్మార్క్ జర్నల్లో ప్రచురించబడింది. "ట్రేడ్మార్క్ చట్ట రంగంలో ఇటీవలి పరిణామాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇది వ్యక్తిత్వ హక్కులకు సంబంధించినది". అని ధోని న్యాయవాది మాన్సి అగర్వాల్ అన్నారు. ట్రేడ్మార్క్ కలిగి ఉండటం వలన క్రీడాకారులు తమ పేరు, లోగో లేదా బ్రాండ్ను రక్షించుకోవడానికి చట్టపరమైన అధికారం కలిగి ఉంటారు. ట్రేడ్మార్క్తో అనుమతి లేకుండా మరొకరు తమ గుర్తింపును ఉపయోగించడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్య తీసుకోవడం సులభం అవుతుంది.
ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించగానే క్రేజ్, ఫాలోయింగ్ తగ్గిపోవడం సహజం. కానీ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో దీనికి భిన్నం. ఈ స్టార్ ఆటగాడికి ఆటకు గుడ్ బై చెప్పిన తర్వాత క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. ఇంత అభిమానానికి కారణం ఐపీఎల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ లో చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ కెప్టెన్ గా జట్టును 5 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. తన కూల్ కెప్టెన్ తో టీమిండియాకు టీ20, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ అందించాడు. దీంతో ఫ్యాన్స్ ధోనీని ముద్దుగా కెప్టెన్ కూల్ గా పిలుచుకుంటారు.
43 ఏళ్ళ ధోనీ ప్రస్తుతం ఇటీవలే ఐపీఎల్ 2025 ముగించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. గత రెండు సీజన్ లో చివర్లో వచ్చి మెరుపులు మెరిపిస్తూ ఫ్యాన్స్ కు ఖుషీ చేస్తున్నాడు. 2023 ఐపీఎల్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుండి వైదొలిగిన ధోనీ 2025 ఐపీఎల్ లో గైక్వాడ్ గాయంతో మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 2026 ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా లేదా అనే విషయంలో ధోనీ ఇంకా ఎలాంటి నిర్ణయం అధికారికంగా ప్రకటించలేదు.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
— Sportskeeda (@Sportskeeda) June 30, 2025
MS Dhoni has filed an online application to trademark the nickname ‘Captain Cool’, a title long linked with his calm and composed leadership. 🧊🙌
The application was submitted through the official Trade Marks Registry portal. #Cricket #MSDhoni… pic.twitter.com/c94LGTmemT