MS Dhoni: సాయం మరవని ధోనీ.. చిన్ననాటి స్నేహితుడికి కొండంత ప్రచారం

MS Dhoni: సాయం మరవని ధోనీ.. చిన్ననాటి స్నేహితుడికి కొండంత ప్రచారం

జీవితంలో ఎంత సాధించినా మన మూలాలు మరవనివాడే నిజమైన మనిషి. ధోనీ ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడనే చెప్పాలి. తన కెరీర్ ఎదగడంలో స్నేహితులు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. MS ధోని.. ది అన్‌టోల్డ్ స్టోరీలో ధోనీ స్నేహ బంధాన్ని స్పష్టంగా చూపించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ సినిమాలో ధోనీ పాత్రలో నటించాడు. వీరిలో పరమజిత్ సింగ్ కూడా ఉన్నాడు. తాజాగా ధోనీ తన స్నేహితుడు పరమజిత్ సింగ్ కోసం కొత్త ప్రచారం మొదలుపెట్టాడు.
   
రాంచీలో ఇటీవలే ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో మహేంద్ర సింగ్ ధోని ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రైమ్ స్పోర్ట్స్ అనేది అతని చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్ సింగ్  యాజమాన్యంలోని సంస్థ. కెరీర్ ప్రారంభంలో ధోనీని ప్రోత్సహించిన తన స్నేహితుడి కోసం ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ లో కూడా ధోనీ ఇదే బ్యాట్ ఆడతాడని తెలుస్తుంది.    

2023 సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ కి గుడ్ బై చెప్పనప్పటికీ.. 2024 ఐపీఎల్ ఆడతాడా లేదా అనుమానం ఫ్యాన్స్ లో నెలకొంది. దీనికి తోడు మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఐపీఎల్ ఆడటం కష్టమే అని భావించారు. అయితే తాజాగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించడంతో ధోనీ ఐపీఎల్ 2024 ఆడటం కన్ఫర్మ్ అయిపోయింది. 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వదలని ధోని ఇప్పటివరకు 5 టైటిల్స్ అందించాడు. 2023లో గుజరాత్ జయింట్స్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచిన సూపర్ కింగ్స్.. 2024 ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది .