బీఆర్ఎస్కు షాక్..కీలక నేత గుడ్ బై

బీఆర్ఎస్కు షాక్..కీలక నేత గుడ్ బై

తెలంగాణ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఎల్బీనగర్  నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ః

ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన సతీమణి , మాజీ కార్పొరేటర్ తో కలిసి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.  

ALSO READ: టార్గెట్ కాంగ్రెస్... ప్రగతి భవన్లో ఆరు వార్ రూంలు

ఎల్బీనగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కేటాయించారు. దీంతో బీఆర్ఎస్ టికెట్ ఆశించిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గత కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో చేరారు.