మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పూణే ఎక్స్ప్రెస్వేలో ఖోపోలి సమీపంలో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో అయిదుగురు మృతిచెందగా.. మరో అయిదుగురు గాయపడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగంతో ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Maharashtra: Five killed and at least five injured in a collision between multiple vehicles on Mumbai – Pune Expressway near Khopoli last night. The injured were taken to a hospital. pic.twitter.com/itblPUEE5X
— ANI (@ANI) February 16, 2021
For More News..