ఒకదానికొకటి ఢీకొన్న పలు వాహనాలు.. అయిదుగురు మృతి

ఒకదానికొకటి ఢీకొన్న పలు వాహనాలు.. అయిదుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఖోపోలి సమీపంలో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో అయిదుగురు మృతిచెందగా.. మరో అయిదుగురు గాయపడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగంతో ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

For More News..

కంప్యూటర్ వర్క్ చేసే వాళ్లు ఇలా చేస్తే చేతి వేళ్లకు బెటర్

ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్రు.. కట్టేస్తున్రు..

క్రిమినల్స్ వేటలో సీసీ కెమెరాలే కీలకం