
ములుగు, వెలుగు: ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు జిల్లా కేంద్రంలోని టాస్క్ రీజినల్ సెంటర్ లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ పొందారని, వారికి ఈనెల 19న జాబ్ మేళా నిర్వహించి వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ దివాకర మంగళవారం తెలిపారు.
ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బుధవారం ఉదయం 10గంటలకు టాస్క్ రీజినల్ సెంటర్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నామన్నారు. పూర్తి వివరాలకు ములుగు టాస్క్ సెంటర్ కోఆర్డినేటర్ మురళిని 96184 49360ని సూచించారు.