
ములుగు, వెలుగు : రోడ్డు భద్రత కార్యక్రమాల్లో భాగంగా ములుగు జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కేవలం రెండు రోజుల్లో హెల్మెట్ ధరించని 600 మంది నుంచి రూ.87,200ల జరిమానా విధించినట్లు ఎస్పీ పి.శబరీశ్ తెలిపారు. బైకర్స్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.
గంజాయిపై సమాచామిస్తే నగదు బహుమతి
తాడ్వాయి: గంజాయి, నకిలీ విత్తనాలపై సమాచారం ఇస్తే నగదు బహుమతి ఇస్తామని ములుగు ఎస్పీ శబరీశ్అన్నారు. శుక్రవారం అభయ మిత్ర కార్యక్రమంలో భాగంగా తాడ్వాయిలో డీఎస్పీ రవీందర్, పస్ర సీఐ రవీందర్సూచనలతో తాడ్వాయి ఎస్ హెచ్వో శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో మత్తుపదార్థాలపై అవగాహన కల్పించేందుకు యువతను భాగస్వాములను చేస్తూ వాలీబాల్ టీర్నమెంట్ నిర్వహించారు.
కార్యక్రమానికి ఎస్పీ శబరీశ్ హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశామని, కమిటీల ద్వారా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బైకర్స్హెల్మెట్ ధరించాలని సూచించారు.