
ఐపీఎల్ 2025 లో భాగంగా శుక్రవారం (మే 30) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభమైంది. చండీఘర్ లోని ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్–2కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుంది. ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే ఇరు జట్లు ఇకపై వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలవాల్సిందే. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్ గెలిస్తే క్వాలిఫయర్ 2.. అది కూడా గెలిస్తే ఫైనల్. దీంతో ఇరు జట్లు కుదురుకోవడానికి ఇక సమయం లేదు.
ఇకపై ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై కావడంతో విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిందే. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇరు జట్ల ఫారెన్ ఆటగాళ్లు తమ స్వదేశానికి వెళ్లడంతో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై జట్టులో బెయిర్ స్టో, గ్లెస్సేన్, రాజ్ భవా ప్లేయింగ్ 11లో చోటు సంపాదించారు. మరోవైపు గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. అర్షదే ఖాన్ స్థానంలో వాషింగ్ టన్.. బట్లర్ స్థానంలో కుశాల్ మెండీస్ ప్లేయింగ్ 11 లోకి వచ్చారు.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
►ALSO READ | IPL 2025: మరికాసేపట్లో గుజరాత్తో ఎలిమినేటర్.. ఐదుగురు అంతర్జాతీయ సారధులకు కెప్టెన్గా పాండ్య