ఎన్నికల సిత్రాలు: నెల కింద బీజేపీలోకి.. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్​లోకి

ఎన్నికల సిత్రాలు: నెల కింద బీజేపీలోకి.. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్​లోకి
  • చండూరులో జంపింగ్​ జపాంగ్​లు

చండూరు, వెలుగు: నెల రోజుల కింద టీఆర్ఎస్ కు చెందిన నలుగురు సర్పంచ్​లు, కాంగ్రెస్ ​పార్టీకి చెందిన ఒక సర్పంచ్​​బీజేపీలో చేరగా..ఆదివారం  మళ్లీ టీఆర్​ఎస్​లో చేరారు. చండూరు మండలంలోని పలు గ్రామాల సర్పంచులు ఇటీవల రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఏమైందో ఏమో గాని ఆదివారం చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం సమక్షంలో హైదరాబాద్​లోని మంత్రి జగదీశ్​రెడ్డి ఇంట్లో టీఆర్ఎస్ ​తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో దొనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ ముందు కాంగ్రెస్ ​నుంచి గెలుపొంది తర్వాత టీఆర్ఎస్​లో చేరారు.

నెల కింద రాజగోపాల్​రెడ్డి సమక్షంలో బీజేపీలోకి రాగా, మళ్లీ ఇప్పుడు టీఆర్​ఎస్​లోకే పోయారు. అలాగే టీఆర్​ఎస్​కు చెందిన గుండ్రపల్లి సర్పంచ్ తీగల సుభాష్, నేర్మట సర్పంచ్ నందికొండ నరసింహ, కస్తాల సర్పంచ్​ ద్రౌపదమ్మ, తుమ్మలపల్లి సర్పంచ్ కృపాటి రాములమ్మలు కూడా నెల కింద బీజేపీలో చేరి ఇప్పుడు టీఆర్ఎస్​ కండువాలు కప్పుకున్నారు. అధికార పార్టీతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో మళ్లీ టీఆర్ఎస్​లో చేరుతున్నట్టు పార్టీ మారిన సర్పంచులు ప్రకటించారు.