మూసాపేటలో షాకింగ్ ఘటన: మాట్లాడట్లేదని ప్రేమికురాలిపై హత్యాయత్నం

మూసాపేటలో షాకింగ్ ఘటన: మాట్లాడట్లేదని ప్రేమికురాలిపై హత్యాయత్నం

కూకట్​పల్లి, వెలుగు: ప్రేమించిన యువతి కొన్ని రోజులుగా దూరంగా ఉంటుందని ఓ యువకుడు ఆమెపై హత్యాయత్నం చేశారు. మూసాపేటలో నివసించే యువతి అఫ్రిజా(19), మహ్మద్​ మోషిన్​(20) ఒకే స్కూల్‎లో చదువుకున్నారు. మొదట ఫ్రెండ్స్‎గా ఉన్న వీరు తరువాత ప్రేమలో పడ్డారు. మోషిన్​ఎలక్ట్రీషియన్‏గా, అఫ్రిజా నర్సుగా పని చేస్తున్నారు. మోషిన్​తరచూ గొడవ పడి తిడుతుండటంతో ఆమె కొన్ని నెలలుగా అతడికి దూరంగా ఉంటోంది. 

ఆదివారం రాత్రి అఫ్రిజాకు ఫోన్​చేసిన మోషిన్​మాట్లాడుకుందామని పిలిచాడు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ మూసాపేట మెట్రో స్టేషన్​ వద్ద కలిశారు. తనతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన మోషిన్​వెంట తెచ్చుకున్న బ్లేడుతో యువతి పొట్టపై దాడి చేశాడు. పోలీసులు బాధితురాలిని సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. కూకట్​పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.