మసీదుల్లో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు

మసీదుల్లో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు

బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ముస్లిం సోదరులు.  అత్యంత భక్తిశ్రద్ధలతో బక్రీద్ పర్వదినాన్ని  చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని  మీరాలం ఈద్గా, మక్కా మసీదులో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో ముసురు వాన పడుతుండటంతో..ఇబ్బందులు పడుతున్నారు ముస్లిం సోదరులు. బక్రీద్ పర్వదిన  సందర్భంగా ముస్లిం సోదరి, సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్, ఇతర రాజకీయ ప్రముఖులు.  భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండగ చాటి చెప్తుందన్నారు సీఎం కేసీఆర్.