కరోనాతో మృతి..అంత్యక్రియలు చేసిన ముస్లిం యువకులు

కరోనాతో మృతి..అంత్యక్రియలు చేసిన ముస్లిం యువకులు

తెలంగాణలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ తో వ్యాప్తి కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా గొల్లవాడకు చెందిన 65 ఏళ్ల బెస్త ఎల్లయ్య రిటైర్డ్ ఎ ఎస్సై కరోనా బారిన పడ్డాడు. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూనే.. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. అయితే.. అతని దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చాలా సమయం మృతదేహాన్ని అలానే ఉంచారు. చివరకు 29వ వార్డు కౌన్సిలర్ భర్త అంజాద్, ముస్లిం యువకులు.. మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటి చెప్పారు.