CAB, NRC బిల్లుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. పౌరసత్వ సవరణ బిల్లు అమలుపై దేశం అట్టుడికిపోతుంది. క్యాబ్ బిల్లును అమలు చేసేందుకు వీలులేదంటూ ఆందోళనకారులు రోడ్లపై వచ్చి తమ ఆందోళనల్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలుప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో సైన్యం బరిలోకి తీగింది.
అయినా ఆందోళనకారులు తమ ఆందోళనల్ని కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. క్యాబ్ కు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఎదురుగా ఆందోళన చేస్తుండగా..ముస్లీం సోదరులు నమాజ్ చేయాల్సి ఉంది. అయితే ముస్లీం సోదరులు నమాజ్ చేస్తుండగా..వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా హిందువులు, సిక్కులు వారికి అండగా నిలిచారు. నమాజ్ పూర్తయ్యే వరకు వారికి అండగా నిలిస్తూ వారికి భద్రత కలిగించడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
#WATCH Delhi: Students and other people of Muslim community offered Namaz outside the gates of Jamia Millia Islamia university. Members of other faiths formed a human chain around them. pic.twitter.com/FEPZOqI1MX
— ANI (@ANI) December 19, 2019