బిహార్లో పట్టపగలే దారుణం.. ఓ ప్రైవేట్ టీచర్ అత్యంత కిరాతంగా హత్యకు గురైంది.. విధులకు వెళ్లి వస్తున్న టీచర్ ను మధ్యలో అడ్డగించి దాడి చేశారు. పిస్టల్ తో కాల్పులు జరిపారు. సోదరుడి కళ్లముందే ఆమెను పాశవికంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే..
బిహార్ లోని ముజఫర్ పూర్ కు చెందిన 21 ఏళ్ల ప్రైవేట్ టీచర్ కోమల్ ను గుర్తు తెలియని దుండగులు మంగళవారం (నవంబర్18)కాల్చి చంపారు. ఆమె సోదరుడు ఆదిత్య తో కలిసి బైక్ పై వెళ్తుండగా అడ్డగించిన దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు.
అడ్డగించిన దుండగులను ఎవరు మీరు అన్ని ప్రశ్నించే లోపే కోమల్ పై కాల్పులు జరిపారు. కుప్పకూలిన కోమల్ శరీరాన్ని కాళ్లతో తన్నారు. మొదట రెండు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు చనిపోలేదని మరో రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసుల చెబుతున్నారు.
దుండగులను అడ్డుకునేందుకు ఆమె సోదరులు ఆదిత్య ప్రయత్నించగా ఈ లోపే జరగాల్సి అంతా జరిగి పోయింది.. కోమల్ పై కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయారు దుండగలు.
కోమల్ పై దాడి , హత్యకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.. ప్రేమ వ్యవహారమా? లేక పాత కక్షలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
కోమల్మాజీ ప్రేమికుడిపై అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. కోమల్ హత్య తర్వాత ఆమె మాజీ ప్రేమికుడు బిట్టును అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు..అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో విడిచిపెట్టారు. సీసీ కెమెరాల పుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
