నాది, నా భార్య ఫోన్ ట్యాప్ చేసిన్రు ..మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

నాది, నా భార్య ఫోన్ ట్యాప్ చేసిన్రు ..మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు
  • నా గన్​మెన్లనూ వదల్లే 

జీడిమెట్ల, వెలుగు: బీఆర్ఎస్​ప్రభుత్వం తన ఫోన్​తోపాటు తన భార్య, గన్​మెన్ల ఫోన్లను కూడా ట్యాప్​చేసిందని కాంగ్రెస్​ లీడర్, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత​రావు అన్నారు. దూలపల్లిలోని ఆయన ఇంట్లో ఆదివారం మాట్లాడుతూ మహాన్యూస్​ఛానెల్​పై జరిగిన దాడిని ఖండించారు. 

బీఆర్ఎస్​ఇంకా తామే ప్రభుత్వంలో ఉన్నామనే భ్రమలో ఉందని ఎద్దేవా చేశారు. దాడులను సహించేది లేదన్నారు. బీఆర్ఎస్​పార్టీలోని ముఖ్య లీడర్ల మూర్ఖపు అలోచనలు, దొంగపనుల వల్లే తాము ఆ పార్టీలో ఇమడలేకపోయామన్నారు.  బీఆర్ఎస్​ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫోన్​ట్యాపింగ్​ద్వారా అధికారులు, మీడియా, జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్​చేసిందన్నారు. 

 ప్రముఖల ప్రైవేట్​మాటలు విని వారి జీవితాలను అంధకారంలోకి నెట్టిందన్నారు. హీరోయిన్స్​ఫోన్​కాల్స్​వినాల్సిన అవసరం ఏముందని ప్రశించారు.  ప్రస్తుతం కాంగ్రెస్​లో కోవర్టులు ఉన్నారని, వారిని గుర్తించి తగిన శాస్తి చేస్తామన్నారు.