
- నా గన్మెన్లనూ వదల్లే
జీడిమెట్ల, వెలుగు: బీఆర్ఎస్ప్రభుత్వం తన ఫోన్తోపాటు తన భార్య, గన్మెన్ల ఫోన్లను కూడా ట్యాప్చేసిందని కాంగ్రెస్ లీడర్, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. దూలపల్లిలోని ఆయన ఇంట్లో ఆదివారం మాట్లాడుతూ మహాన్యూస్ఛానెల్పై జరిగిన దాడిని ఖండించారు.
బీఆర్ఎస్ఇంకా తామే ప్రభుత్వంలో ఉన్నామనే భ్రమలో ఉందని ఎద్దేవా చేశారు. దాడులను సహించేది లేదన్నారు. బీఆర్ఎస్పార్టీలోని ముఖ్య లీడర్ల మూర్ఖపు అలోచనలు, దొంగపనుల వల్లే తాము ఆ పార్టీలో ఇమడలేకపోయామన్నారు. బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫోన్ట్యాపింగ్ద్వారా అధికారులు, మీడియా, జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్చేసిందన్నారు.
ప్రముఖల ప్రైవేట్మాటలు విని వారి జీవితాలను అంధకారంలోకి నెట్టిందన్నారు. హీరోయిన్స్ఫోన్కాల్స్వినాల్సిన అవసరం ఏముందని ప్రశించారు. ప్రస్తుతం కాంగ్రెస్లో కోవర్టులు ఉన్నారని, వారిని గుర్తించి తగిన శాస్తి చేస్తామన్నారు.