వరంగల్ లో మిస్సైన వరుడు చనిపోయాడు..

వరంగల్ లో మిస్సైన వరుడు చనిపోయాడు..

వరంగల్ జిల్లాలో వరుడు మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం అయింది. సోమవారం పెండ్లి పత్రికలు ఇచ్చి వస్తానని చెప్పి వెళ్లిన వరుడు  కృష్ణ తేజ శవమై కనిపించాడు. వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారు ప్రాంతంలోని కెనాల్ లో కృష్ణతేజ మృతదేహం దొరికింది. పలివెల్పుల ఎస్సార్ఎస్పీ కెనాల్ వద్ద మృతుడి బైక్ ను గుర్తించారు పోలీసులు. వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారు ప్రాంతంలోని కెనాల్ లో కృష్ణతేజ మృతదేహం దొరికింది.ఇది హత్యా..? లేదా ఆత్మహత్యా..?  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నెల 16న నర్సంపేటకు చెందిన ఓ యువతితో కృష్ణతేజ అనే వ్యక్తికి వివాహం నిశ్చమైంది. అయితే పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కృష్ణతేజ అదృశ్యమయ్యాడు. కృష్ణతేజ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.  

హనుమకొండ టౌన్ గోకుల్ నగర్ ప్రాంతానికి చెందిన కృష్ణ తేజ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. నర్సంపేటకు చెందిన యువతితో అతడికి పెండ్లి కుదిరింది. ఈనెల పెళ్లి ముహూర్తం ఖారారు అయింది. ఇరు కుటుంబాలకు చెందిన వారు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మరో నాలుగు రోజుల్లో పెండ్లి ఉండగా.. వరుడు కృష్ణ తేజ కనిపించకుండా పోయాడు. కృష్ణ తేజ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.